8, జనవరి 2021, శుక్రవారం

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి


పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయితే అతనికి వృధాప్యం రావడం వల్ల అతను వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేకపోతాడు. పరమభక్తుడైన ద్వారకుడి ఇబ్బందిని గ్రహించిన వేంకటేశ్వరుడు అతను నివాసం ఉంటున్న ప్రదేశంలో విగ్రహ రూపంలో వెలుస్తారు. అలా వేంకటేశ్వర స్వామి వారు ద్వారకుడి వలన ఇక్కడ వెలిశారని ఆయన గుర్తుగా ఈ ప్రదేశాన్ని ద్వారకా తిరుమల అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. పెద్ద తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న వారు చిన్న తిరుపతిలో ఆ మొక్కును చెల్లిస్తే వారికి పెద్ద తిరుపతిలో మొక్కు చెల్లించిన ఫలితం లభిస్తుంది అని అంటారు. కాని చిన్న తిరుపతిలో  మొక్కిన మొక్కు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని అక్కడి జనం అంటుంటారు.


ఈ వేంకటేశ్వరుని దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని మండలం మరియు గ్రామం అయిన ద్వారకా తిరుమలలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలోను, భీమడోలుకు 15 కిలోమీటర్ల దూరంలో కొలువై వుంది. ప్రస్తుతం ఉన్న గుడి,  మండపము, గోపురము, ప్రాకారాలను నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు గారు కట్టించారు. బంగారు ఆభరణాలు,వెండి వాహనాలను రాణి చిన్నమ్మ రావు స్వామి వారికి సమర్పించారు. ఈ గ్రామం పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంటుంది. దీనిని సుదర్శన పుష్కరిణి, కుమార తీర్థమని  అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవంను కన్నుల పండుగగా జరుపుతారు. 

వేంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో ఆశ్రమంలో ఉండవలసి వస్తుంది. ఆ సమయంలో వేంకటేశ్వర స్వామికి ఆకలి వేస్తే అప్పుడు అక్కడికి వచ్చిన ఆవు యొక్క పాలను త్రాగుతాడు. అది చుసిన ఆ ఆవు యొక్క యజమాని కోపంతో వేంకటేశ్వరుని తలపై కర్రతో గట్టిగా కొడతాడు. అప్పుడు వేంకటేశ్వరుని తలపై చిన్న గాయం అవ్వడమే కాకుండా జుట్టు కూడా కొంచెం ఊడిపోతుంది. అయితే కలియుగ దైవం  అయిన వేంకటేశ్వర స్వామిని జుట్టు లేకుండా చుసిన గాంధర్వ కన్యా రాకుమారి అయిన నీలాదేవి తన కొప్పులో నుండి కొన్ని వెంట్రుకలను తీసి స్వామి వారి తలపై అలంకరిస్తుంది. అప్పటి నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తులు నీలాదేవిని గౌరవిస్తూ తమ నీలాలను స్వామి వారి గుడి ప్రాంగణంలో ఉన్న కళ్యాణ కట్టలో సమర్పిస్తారు. 

ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు కొండ పైన ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయం మరియు వేంకటేశ్వరుని మందిరానికి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న కుంకుళ్ళమ్మ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ పుణ్యస్థలానికి వచ్చిన వారు ఈ మందిరాలను కూడా దర్శించుకుని వెళ్తారు. అంతే కాకుండా కొండ పైన ఉన్న గోశాలలోని గోవులు, మరియు గజరాజులు మనకు కనుల విందు కలిగిస్తాయి. 

స్వామి వారి దేవస్థానము ఆధ్వర్యంలో ఉన్న పద్మావతి వసతి గృహం, ఆండాళ్ అతిధి గృహం, సీత నిలయం, టీటీడీ అతిధి గృహాలు మనకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మీరు  ఏ సమయంలో వచ్చిన ఇక్కడ బస చేయవచ్చు. అంతేకాకుండా ప్రతి రోజు నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే దీనికోసం  భక్తులు ముందుగానే టిక్కెట్ కౌంటర్ వద్ద టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్వామి వారి లడ్డు ప్రసాదం కోసం కూడా ముందుగానే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భక్తులు ఈ లడ్డు కోసం డబ్బు చెల్లించవలసి ఉంటుంది.  

విజయవాడ నుండి ద్వారకా తిరుమలకు 98 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 72 కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం నుండి 47 కిలోమీటర్లు, భీమడోలు నుండి 17 కిలోమీటర్లు దూరం ఉంటుంది. 

5, జనవరి 2021, మంగళవారం

తులసి మన ఇంట ఆరోగ్యం మన వెంట.

తులసి  చెట్టు


హిందువుల ఆరాధ్య దైవాలలో ఒకరైన విష్ణువుకు ప్రీతిపాత్రమైన చెట్టు తులసి చెట్టు. తెలుగింటి ఆడపడుచులు తులసి చెట్టును తమ దైవంగా ప్రార్థిస్తారు. తులసి ఆకుల తీర్దాన్ని ప్రతి గుడిలోనూ భక్తులకు అందిస్తారు. తులసి చెట్టు సర్వరోగ నివారిణిగా మనకు ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ఉన్న ఇంటిలో త్రిమూర్తులు కొలువుంటారని ప్రతీతి. అంతేకాకూండా 2000 సంవత్సరాల ఆయుర్వేద వైద్యంలో తులసి చెట్టు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా ఔషధాల
తయారీలోను ఈ తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. హిందువుల ముఖ్య పండుగలలో తులసి ఆకులను పూజ చేయడానికి ఉపయోగిస్తారు.


ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మాత పూజను హిందువులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ రోజు తులసి చెట్టు చుట్టూ పందిరి వేసి ఆ పందిరిని మావిడాకులతో అలంకరించి,
బాణాసంచా కాలుస్తూ నిష్ఠగా ఆ పూజను ఆచరిస్తారు. ఉదయాన్నే తులసి చెట్టును దర్శించడం ద్వారా పాపాలు నశిస్తాయి. తులసి చెట్టు ఉన్న చోట దుష్టశక్తులు దరిచేరవు. హిందువుల ఆచార సాంప్రదాయాలలో తులసి చెట్టును విశిష్టంగా వాడతారు. యేసుక్రీస్తును శిలువ వేసిన చోట తులసి చెట్టు మొలచిందని అంటుంటారు.

తులసి చెట్టు యొక్క ఉపయోగాలు :


1) తులసి ఆకులు తినడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. 
2) తులసి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా జ్వరం లాంటి రోగాలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. 
3) తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగడం ద్వారా గొంతు గరగరను తగ్గించుకోవచ్చు. 
4) ప్రతి రోజు 5 తులసి ఆకులను ధనియాలు,మిరియాలతో కలిపి మిశ్రమంగా చేసుకుని తింటే పొట్టలోని నులి పురుగులు నశిస్తాయి. 
5) రెండు స్పూన్ల తులసి ఆకుల రసాన్ని తేనె కలుపుకుని తాగడం వల్ల పైత్యం తగ్గుతుంది. 
6) తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. 
7) తులసి ఆకులు తినడం వల్ల చెడు శ్వాస తగ్గుతుంది,
8) తులసి ఆకులను మజ్జిగలో వేసుకుని తాగితే బరువు తగ్గుతుంది. 
9) తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
10) తులసి ఆకులను తీసుకుంటే మూత్రపిండాలు శుభ్రమవుతాయి. 
11) తులసి ఆకులు తింటే గుండెకు రక్త సరఫరా సక్రమంగా అయ్యేలా చేస్తాయి. 
12) ఎన్నో రకాల ఔషధగుణాలు ఉన్న తులసి ఆకులను తిందాం, ఆరోగ్యంగా ఉందాం.  

2, జనవరి 2021, శనివారం

ప్రొద్దున్నే ఒక గ్లాస్ వాటర్ చేస్తుంది మీ ఆరోగ్యాన్ని పారాహుషార్.

మంచి నీళ్లు తాగండి ఆరోగ్యంగా ఉండండి.


మంచి నీళ్లు ఇది మన ముందు ఉన్న దివ్య ఔషధం. మనిషి శరీరం 60 నుండి 70 శాతం నీటితో తయారు చేయబడి  ఉంటుంది. మనం ఉదయం లేవగానే రెండు గ్లాసుల వాటర్ తాగడం ద్వారా మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు మన రోజూవారి కార్యక్రమాల్లో చాలా ఆరోగ్యంగాను,ఉత్సహాంగాను పాల్గొనగల్గుతాం. అంతేకాకుండా మనం ఈ మంచినీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా పలు రకాల ఆరోగ్య సమస్యలకు దూరం కావొచ్చు.     



ఉదయం లేవగానే మొదటగా మనం గోరువెచ్చని మంచి నీళ్ళని రెండు గ్లాసులు తీసుకోవాలి. ఒక వేళ మీకు అలా తాగడం కుదరక పోతే ఒక బాటిల్ నిండా మంచి నీళ్ళని పట్టుకుని కొంచెం కొంచెంగా తాగండి,ఉదయాన్నేఇలా చేయడం ద్వారా మన శరీరంలో పోషకాలు పెరగడమే కాకుండా శరీరంలోని మలినాలు  శుభ్రం అవుతాయి. ప్రధానంగా మనం ఈ మంచి నీళ్లు తాగిన 30 నిమిషాల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుకోవచ్చు. 

ఉదయాన్నే మంచి నీళ్లు తాగడం ద్వారా శరీరం శుభ్రం అవడమే కాకుండా మన ఊపిరితిత్తుల పని తీరును మెరుగు పడుతుంది. ఒక టీస్పూన్ మెంతులు గ్లాస్ వాటర్లో కలుపుకుని తాగడం ద్వారా రక్తపోటు,మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడంకోసం కూడా ఈ మెంతుల వాటర్ ఉపయోగపడుతుంది.

మన శరీరానికే కాకుండా చర్మసౌందర్యానికి కూడా మనం త్రాగే మంచి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ చేయడం ద్వారా చర్మం మరింత ప్రకాశవంతంగా వెలిగేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఈ మంచి నీళ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా శరీరాన్ని తగ్గించుకోవడానికి ఈ వాటర్ ఎంతగానో ఉపయోగపడతాయి.
రోజుకు 8 గ్లాసుల వాటర్ తాగడం ద్వారా మన శరీర జీర్ణవ్యవస్థను చక్కదిద్దుకోవడమే కాకుండా తొందరగా బరువు తగ్గొచ్చు.

కాబట్టి మంచి నీళ్లను నిర్లక్ష్యం చేయకుండా తాగుదాం రోగాలకు దూరంగా ఉందాం.

30, డిసెంబర్ 2020, బుధవారం

ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు తింటూ చర్మసౌందర్యాన్ని కాపాడుకుందాం.

మగువకు అలంకారం చర్మ సౌందర్యం 


రోజువారి జీవన విధానాలు, దుమ్ము, కాలుష్యం, ఆహార అలవాట్లు మన చర్మాన్ని , జుట్టును ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా మన అలవాట్లు సక్రమంగా లేకపోతే మనం చిన్న వయసులోనే ముసలిగా కనిపించడం, ముఖం నీరసంగా ఉండడం లాంటివి జరుగుతాయి. ఆరోగ్యకరమైన ఆహారపు విధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా మన చర్మం ఎక్కువ కాలం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి మన చర్మం ముడతలను దాచుకోవడం కోసం మేకప్ బాక్స్ వైపు చూడడం కాకుండా మనం తినే ఆహారపదార్ధాల వైపు చూద్దాం. 


మన చర్మ సౌందర్యాన్ని పెంచే కొన్ని ఆహారపదార్థాలను గురించి తెలుసుకుందాం.


డ్రై ఫ్రూట్స్ మరియు విత్తనాలు


బాదం, వాల్ నట్స్ , విత్తనాలలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మం మృదువుగాను, సౌందర్యవంతంగాను ఉండడానికి సహకరిస్తాయి. 
 

ప్రోటీన్


శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే చర్మం పొడి బారిపోవడం, జుట్టు పలచబడడం లాంటివి జరుగుతాయి. ప్రోటీన్స్ ఎక్కువగా గుడ్లు, పాలు, ధాన్యాలలో ఉంటాయి. జుట్టు లో కెరటిన్ అనే పోషకం ఉంటుంది. ఈ పోషకం అనేది జుట్టుకు సరిగ్గా అందనపుడు జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. మనం ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నియంత్రించవచ్చు.
  

విటమిన్-సి


విటమిన్-సి చర్మం కాంతివంతంగా ఉండడానికి, జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను దెబ్బ తీసే బ్యాక్టీరియా లను నాశనం చేస్తాయి. తద్వారా చర్మం తొందరగా ముడతలు పడడం మరియు చిన్న వయసులోనే జుట్టు మెరిసిపోవడాన్ని నియంత్రిస్తుంది. 

విటమిన్-ఏ


చర్మం నిగారిస్తూ, కాంతివంతంగా ఉండడానికి విటమిన్-ఏ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్-ఏ ఎక్కువగా క్యారెట్, గుమ్మడి, మామిడి, బొప్పాయి లలో ఉంటుంది. అంతేకాకుండా విటమిన్-ఏ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి కరోనా లాంటి రోగాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
 

పెరుగు


పెరుగు మంచి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ను కలిగి ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ప్రకాశవంతమైన మరియు ఎటువంటి మచ్చలు లేని చర్మాన్ని పొందవచ్చు. పెరుగు మన జుట్టు ఎదుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

27, డిసెంబర్ 2020, ఆదివారం

తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సినిమా తెలుగు సినిమా.

తెలుగు సినీ పరిశ్రమ (TFI)


ప్రపంచ పటంలో ఎక్కడో మారుమూల చిన్న పరిశ్రమ. కాని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలను రూపొందిస్తోంది ఈ పరిశ్రమ. భారత దేశ సినిమా ఖ్యాతిని నలుదిశలకు ప్రసరింప చేస్తూ బలంగా నిలబడింది ఈ పరిశ్రమ. అంతేకాకుండా యువతరానికి నేనున్నాను అన్న భరోసాను కలిగిస్తుంది ఈ పరిశ్రమ. ఎంతో మంది యువ నటీనటులకు,నిర్మాతలకు,దర్శకులకు అవకాశం కల్పిస్తోంది ఈ సినీ పరిశ్రమ. అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించేలా చేస్తుంది ఈ పరిశ్రమ. ఎంతోమంది పేద కార్మికులకు అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ. దాన వీర సూర కర్ణ,అల్లూరి సీతారామరాజు,మేజర్ చంద్రకాంత్,శివ,సమర సింహ రెడ్డి,ఠాగూర్,పోకిరి,గబ్బర్ సింగ్ మరియు ఈగ,బాహుబలి,బహుబలి 2 లాంటి చిత్రాలతో చరిత్ర సృష్టించిన పరిశ్రమ. 2013 లో భారతదేశానికి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 17 శాతం వాటాను కలిగి ఉన్న పరిశ్రమ. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న మనందరి పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ తెలుగు చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తారు. 


తెలుగు సినిమాలకు పితృ సమానుడిగా రఘపతి వెంకయ్య నాయుడు గారిని కొలుస్తారు. ఈయన 20వ శతాబ్దం మొదట్లో సొంతంగా సినిమాలను తీస్తూ తెలుగు సినిమాలను గురించి తెలియ చేయడానికి ప్రపంచమంతా పర్యటించేవారు. అయితే మొదట్లో అన్ని మూగ సినిమాలు తీసేవారు. హెచ్.ఎమ్.రెడ్డి అనే వ్యక్తి మొదటి తెలుగు-తమిళ్ మోషన్ పిక్చర్ అయిన కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో మంచి విజయం సాధించిన భక్త ప్రహళ్లాద సినిమాకు దర్శకుడు. సి.ఎన్.ఎన్ ఛానల్ ప్రకటించిన 100 భారతదేశ అద్భుత చిత్రాలలో పాతాళ భైరవి,మల్లీశ్వరి,దేవదాసు,మాయాబజార్,నర్తనశాల మరియు మరోచరిత్ర,మా భూమి,సాగర సంగమం,శంకరాభరణం,శివ సినిమాలు నిలిచాయి. 2017 లో విడుదలైన బాహుబలి2 సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018-2019 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన పరిశ్రమలలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ నిలిచింది. 

20వ శతాబ్దంలో నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,మురళీ మోహన్ లాంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవి.  

మొదట్లో బ్లాక్ అండ్ వైట్ 35mm సినిమాలు సినిమా థియేటర్లలో విడుదల చేసేవారు. మొదటి తెలుగు సినిమా స్కోప్ చిత్రాన్ని హీరో  కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా మొదటి 75 mm చిత్రాన్ని సింహాసనం చిత్రం ద్వారా హీరో కృష్ణ మన ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాకుండా మొదటి డి.టి.ఎస్ చిత్రాన్ని తెలుగు వీర లేవరా సినిమా ద్వారా హీరో కృష్ణ మనకు పరిచయం చేసారు. 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్,గీత ఆర్ట్స్,వైజయంతి మూవీస్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఆర్కా మీడియా,మైత్రి మూవీస్,యూవీ క్రియేషన్స్,14 రీల్స్ లాంటి సంస్థలు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నాయి. 

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నాయి. 

అనుష్క శెట్టి,కాజల్ అగర్వాల్,సమంత,తమన్నా,నయనతార,రష్మిక మందాన,నభా నటాషా,కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అగ్రతారలుగా వెలుగొందుతున్నారు.  
 

24, డిసెంబర్ 2020, గురువారం

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో మీ బరువును సునాయాసంగా తగ్గించుకోండి.

ఆరోగ్యకరంగా బరువును తగ్గించుకుందాం.


ఈ రోజుల్లో యువకుల నుండి పెద్దవారి వరకు అధికమైన శరీర బరువు అనేది ప్రధాన సమస్యగా మారింది. మనం లావుగా ఉంటే మనల్ని చూసి ఎంతో మంది హేళన చేస్తారు. బండి మీద మనం తప్పించి వేరేవారు కూర్చోవడానికి అవకాశం ఉండదు. సరిగ్గా పరిగెత్తలేము. ఏదైనా పనిని కొంచెం సేపు చేస్తే ఆయాసం వచ్చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో గ్యాస్ పెరిగిపోయి తేన్పులు రావడం, కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్తం సక్రమంగా సరఫరా కాకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. బరువు పెరగడం వల్ల ఇటువంటివే కాకుండా ఇంకా మరెన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం మన శరీర బరువును సమానంగా ఉంచుకుంటూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం.


మన బరువును సమానంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరంగా ఉండే కొన్ని విధానాలను తెలుసుకుందాం.


1) సమయానికి ఆహారం తీసుకోవడం. 

2) కాయగూరలు,ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం. 

3) మంచి నీటిని తరచుగా తాగడం. 

4) కొవ్వు పదార్ధాలైన స్వీట్స్, నెయ్యి లాంటి ఆహారపదార్ధాలను తక్కువగా తినడం. 

5) ఆయిల్ ద్వారా తయారయ్యే వస్తువులైన ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీస్, బజ్జిలు లాంటి వాటిని తినకపోవడం. 

6) ఉదయం టిఫిన్ గా మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం. 

7) మధ్యాహ్నం భోజన సమయంలో కొరలు లేదా దంపుడు బియ్యం ద్వారా వండిన ఆహారాన్ని తీసుకోవడం. 

8) రాత్రి భోజన సమయంలో రెండు చపాతీలు తినడం. 

9) మధ్యలో ఆకలి వేస్తే పండ్లను తినడం. 

10) రాగి జావను తాగడం.

11) క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామాలు చేయడం  

ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని, బరువును సక్రమంగా ఉంచుకోండి.  

 

21, డిసెంబర్ 2020, సోమవారం

మంచు గడ్డల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

మంచు(snow )


వేసవి కాలంలో భానుడి ప్రతాపం నుండి తట్టుకోవడానికి ప్రజలు ఎక్కువగా చల్లటి ప్రదేశాలకు వెళ్తారు. అయితే యూరోపియాన్ ప్రాంతాలు వేసవి కాలంలో కూడా చల్లదనాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల పర్యాటకులు ఈ ప్రాంతాలకు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ శీతోష్ణ ప్రాంతాలలో మనకు ఎక్కువగా కనిపించేవి మంచు గడ్డలు. మంచుగడ్డలు మేఘాల నుండి భూమి పైకి రాలతాయి. అంతేకాకుండా ఈ మంచు గడ్డలు ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. మంచు గడ్డల చల్లదనం వల్ల మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ ప్రాంతాల ప్రజలు స్వేట్టర్ లను, దుప్పట్లను ఎక్కువగా వాడతారు. 
 


మంచు గురించి అక్కడి ప్రదేశం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


1) వాతావరణంలోని మంచు బిందువులు మేఘాలలోకి ఒక్కొక్కటిగా చేరి మంచు గడ్డలుగా మారతాయి. ఆ మంచు గడ్డలు మేఘాల నుండి భూమిపై పడతాయి.
 
2) శాస్త్రవేత్తల పరిశోధనలో ఏ రెండు మంచు గడ్డలు ఒకేలాగా ఉండవు అని తేలింది. కాని 1988 లో మాత్రం ఒక శాస్త్రవేత్త తనకు రెండు ఒకేలా ఉన్న మంచు గడ్డలు దొరికాయి అని అన్నారు.

3) ఈ మంచుగడ్డలలో అతిపెద్ద మంచుగడ్డ ఎత్తు 15 అంగుళాలు అని వెల్లడించారు. 

4) సహజంగా ఈ మంచు గడ్డ రంగులేని అపారదర్శక వస్తువు. ఇది అద్దం లాంటిది. దీని నుండి కాంతి చొచ్చుకుని పోలేదు.

5) యునైటెడ్ స్టేట్స్ లో శీతాకాలం సమయంలో ఒక స్టెఫిలియన్ ( ఒక స్టెఫిలియాన్ 24 సున్నాలను కలిగి ఉంటుంది)  మంచు స్పటికాలు ఆకాశంలోని మేఘాల నుండి వెలువడతాయి.

6) మాములుగా అమెరికాలో 24 గంటల పాటు పడే మంచు 75.8 అంగుళాలుగా ఉంది. అయితే 1921లో మాత్రం ఆరు అడుగుల మంచు కురిసింది.

7) మంచు ద్వారా తయారు చేయబడ్డ ఇళ్లను ఇగ్లూస్ అంటారు. ఇవి మనిషి యొక్కఉష్ణాన్ని తీసుకుని వేడిగా మారతాయి. మంచుతో కట్టినవైనా గాని వీటి లోపల వేడిగా ఉంటుంది. 

8) నోవా స్కోటియా, నార్త్ డకోటా, ఉత్తర డకోటా ప్రజలు మంచు దేవతలను తయారు చేసి రికార్డులను సృష్టించారు. 

9) సీతల్ ప్రాంతంలో అతిపెద్ద మంచు యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధానికి రెండు బ్యారేజ్ లు అడ్డువస్తున్నాయని 5834 మంచు యోధులు వాటిని తొలగించారు.  

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...