8, జనవరి 2021, శుక్రవారం

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి


పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయితే అతనికి వృధాప్యం రావడం వల్ల అతను వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేకపోతాడు. పరమభక్తుడైన ద్వారకుడి ఇబ్బందిని గ్రహించిన వేంకటేశ్వరుడు అతను నివాసం ఉంటున్న ప్రదేశంలో విగ్రహ రూపంలో వెలుస్తారు. అలా వేంకటేశ్వర స్వామి వారు ద్వారకుడి వలన ఇక్కడ వెలిశారని ఆయన గుర్తుగా ఈ ప్రదేశాన్ని ద్వారకా తిరుమల అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. పెద్ద తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న వారు చిన్న తిరుపతిలో ఆ మొక్కును చెల్లిస్తే వారికి పెద్ద తిరుపతిలో మొక్కు చెల్లించిన ఫలితం లభిస్తుంది అని అంటారు. కాని చిన్న తిరుపతిలో  మొక్కిన మొక్కు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని అక్కడి జనం అంటుంటారు.


ఈ వేంకటేశ్వరుని దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని మండలం మరియు గ్రామం అయిన ద్వారకా తిరుమలలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలోను, భీమడోలుకు 15 కిలోమీటర్ల దూరంలో కొలువై వుంది. ప్రస్తుతం ఉన్న గుడి,  మండపము, గోపురము, ప్రాకారాలను నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు గారు కట్టించారు. బంగారు ఆభరణాలు,వెండి వాహనాలను రాణి చిన్నమ్మ రావు స్వామి వారికి సమర్పించారు. ఈ గ్రామం పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంటుంది. దీనిని సుదర్శన పుష్కరిణి, కుమార తీర్థమని  అంటారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవంను కన్నుల పండుగగా జరుపుతారు. 

వేంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో ఆశ్రమంలో ఉండవలసి వస్తుంది. ఆ సమయంలో వేంకటేశ్వర స్వామికి ఆకలి వేస్తే అప్పుడు అక్కడికి వచ్చిన ఆవు యొక్క పాలను త్రాగుతాడు. అది చుసిన ఆ ఆవు యొక్క యజమాని కోపంతో వేంకటేశ్వరుని తలపై కర్రతో గట్టిగా కొడతాడు. అప్పుడు వేంకటేశ్వరుని తలపై చిన్న గాయం అవ్వడమే కాకుండా జుట్టు కూడా కొంచెం ఊడిపోతుంది. అయితే కలియుగ దైవం  అయిన వేంకటేశ్వర స్వామిని జుట్టు లేకుండా చుసిన గాంధర్వ కన్యా రాకుమారి అయిన నీలాదేవి తన కొప్పులో నుండి కొన్ని వెంట్రుకలను తీసి స్వామి వారి తలపై అలంకరిస్తుంది. అప్పటి నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తులు నీలాదేవిని గౌరవిస్తూ తమ నీలాలను స్వామి వారి గుడి ప్రాంగణంలో ఉన్న కళ్యాణ కట్టలో సమర్పిస్తారు. 

ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు కొండ పైన ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయం మరియు వేంకటేశ్వరుని మందిరానికి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న కుంకుళ్ళమ్మ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ పుణ్యస్థలానికి వచ్చిన వారు ఈ మందిరాలను కూడా దర్శించుకుని వెళ్తారు. అంతే కాకుండా కొండ పైన ఉన్న గోశాలలోని గోవులు, మరియు గజరాజులు మనకు కనుల విందు కలిగిస్తాయి. 

స్వామి వారి దేవస్థానము ఆధ్వర్యంలో ఉన్న పద్మావతి వసతి గృహం, ఆండాళ్ అతిధి గృహం, సీత నిలయం, టీటీడీ అతిధి గృహాలు మనకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మీరు  ఏ సమయంలో వచ్చిన ఇక్కడ బస చేయవచ్చు. అంతేకాకుండా ప్రతి రోజు నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే దీనికోసం  భక్తులు ముందుగానే టిక్కెట్ కౌంటర్ వద్ద టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్వామి వారి లడ్డు ప్రసాదం కోసం కూడా ముందుగానే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భక్తులు ఈ లడ్డు కోసం డబ్బు చెల్లించవలసి ఉంటుంది.  

విజయవాడ నుండి ద్వారకా తిరుమలకు 98 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 72 కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం నుండి 47 కిలోమీటర్లు, భీమడోలు నుండి 17 కిలోమీటర్లు దూరం ఉంటుంది. 

5, జనవరి 2021, మంగళవారం

తులసి మన ఇంట ఆరోగ్యం మన వెంట.

తులసి  చెట్టు


హిందువుల ఆరాధ్య దైవాలలో ఒకరైన విష్ణువుకు ప్రీతిపాత్రమైన చెట్టు తులసి చెట్టు. తెలుగింటి ఆడపడుచులు తులసి చెట్టును తమ దైవంగా ప్రార్థిస్తారు. తులసి ఆకుల తీర్దాన్ని ప్రతి గుడిలోనూ భక్తులకు అందిస్తారు. తులసి చెట్టు సర్వరోగ నివారిణిగా మనకు ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ఉన్న ఇంటిలో త్రిమూర్తులు కొలువుంటారని ప్రతీతి. అంతేకాకూండా 2000 సంవత్సరాల ఆయుర్వేద వైద్యంలో తులసి చెట్టు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా ఔషధాల
తయారీలోను ఈ తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. తులసి చెట్టు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. హిందువుల ముఖ్య పండుగలలో తులసి ఆకులను పూజ చేయడానికి ఉపయోగిస్తారు.


ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మాత పూజను హిందువులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ రోజు తులసి చెట్టు చుట్టూ పందిరి వేసి ఆ పందిరిని మావిడాకులతో అలంకరించి,
బాణాసంచా కాలుస్తూ నిష్ఠగా ఆ పూజను ఆచరిస్తారు. ఉదయాన్నే తులసి చెట్టును దర్శించడం ద్వారా పాపాలు నశిస్తాయి. తులసి చెట్టు ఉన్న చోట దుష్టశక్తులు దరిచేరవు. హిందువుల ఆచార సాంప్రదాయాలలో తులసి చెట్టును విశిష్టంగా వాడతారు. యేసుక్రీస్తును శిలువ వేసిన చోట తులసి చెట్టు మొలచిందని అంటుంటారు.

తులసి చెట్టు యొక్క ఉపయోగాలు :


1) తులసి ఆకులు తినడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. 
2) తులసి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా జ్వరం లాంటి రోగాలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. 
3) తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగడం ద్వారా గొంతు గరగరను తగ్గించుకోవచ్చు. 
4) ప్రతి రోజు 5 తులసి ఆకులను ధనియాలు,మిరియాలతో కలిపి మిశ్రమంగా చేసుకుని తింటే పొట్టలోని నులి పురుగులు నశిస్తాయి. 
5) రెండు స్పూన్ల తులసి ఆకుల రసాన్ని తేనె కలుపుకుని తాగడం వల్ల పైత్యం తగ్గుతుంది. 
6) తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. 
7) తులసి ఆకులు తినడం వల్ల చెడు శ్వాస తగ్గుతుంది,
8) తులసి ఆకులను మజ్జిగలో వేసుకుని తాగితే బరువు తగ్గుతుంది. 
9) తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
10) తులసి ఆకులను తీసుకుంటే మూత్రపిండాలు శుభ్రమవుతాయి. 
11) తులసి ఆకులు తింటే గుండెకు రక్త సరఫరా సక్రమంగా అయ్యేలా చేస్తాయి. 
12) ఎన్నో రకాల ఔషధగుణాలు ఉన్న తులసి ఆకులను తిందాం, ఆరోగ్యంగా ఉందాం.  

2, జనవరి 2021, శనివారం

ప్రొద్దున్నే ఒక గ్లాస్ వాటర్ చేస్తుంది మీ ఆరోగ్యాన్ని పారాహుషార్.

మంచి నీళ్లు తాగండి ఆరోగ్యంగా ఉండండి.


మంచి నీళ్లు ఇది మన ముందు ఉన్న దివ్య ఔషధం. మనిషి శరీరం 60 నుండి 70 శాతం నీటితో తయారు చేయబడి  ఉంటుంది. మనం ఉదయం లేవగానే రెండు గ్లాసుల వాటర్ తాగడం ద్వారా మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు మన రోజూవారి కార్యక్రమాల్లో చాలా ఆరోగ్యంగాను,ఉత్సహాంగాను పాల్గొనగల్గుతాం. అంతేకాకుండా మనం ఈ మంచినీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా పలు రకాల ఆరోగ్య సమస్యలకు దూరం కావొచ్చు.     



ఉదయం లేవగానే మొదటగా మనం గోరువెచ్చని మంచి నీళ్ళని రెండు గ్లాసులు తీసుకోవాలి. ఒక వేళ మీకు అలా తాగడం కుదరక పోతే ఒక బాటిల్ నిండా మంచి నీళ్ళని పట్టుకుని కొంచెం కొంచెంగా తాగండి,ఉదయాన్నేఇలా చేయడం ద్వారా మన శరీరంలో పోషకాలు పెరగడమే కాకుండా శరీరంలోని మలినాలు  శుభ్రం అవుతాయి. ప్రధానంగా మనం ఈ మంచి నీళ్లు తాగిన 30 నిమిషాల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుకోవచ్చు. 

ఉదయాన్నే మంచి నీళ్లు తాగడం ద్వారా శరీరం శుభ్రం అవడమే కాకుండా మన ఊపిరితిత్తుల పని తీరును మెరుగు పడుతుంది. ఒక టీస్పూన్ మెంతులు గ్లాస్ వాటర్లో కలుపుకుని తాగడం ద్వారా రక్తపోటు,మధుమేహ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడంకోసం కూడా ఈ మెంతుల వాటర్ ఉపయోగపడుతుంది.

మన శరీరానికే కాకుండా చర్మసౌందర్యానికి కూడా మనం త్రాగే మంచి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటర్ మన శరీరాన్ని హైడ్రేట్ చేయడం ద్వారా చర్మం మరింత ప్రకాశవంతంగా వెలిగేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఈ మంచి నీళ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా శరీరాన్ని తగ్గించుకోవడానికి ఈ వాటర్ ఎంతగానో ఉపయోగపడతాయి.
రోజుకు 8 గ్లాసుల వాటర్ తాగడం ద్వారా మన శరీర జీర్ణవ్యవస్థను చక్కదిద్దుకోవడమే కాకుండా తొందరగా బరువు తగ్గొచ్చు.

కాబట్టి మంచి నీళ్లను నిర్లక్ష్యం చేయకుండా తాగుదాం రోగాలకు దూరంగా ఉందాం.

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...