amazing లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
amazing లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2020, ఆదివారం

తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న సినిమా తెలుగు సినిమా.

తెలుగు సినీ పరిశ్రమ (TFI)


ప్రపంచ పటంలో ఎక్కడో మారుమూల చిన్న పరిశ్రమ. కాని ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ సినిమాలను రూపొందిస్తోంది ఈ పరిశ్రమ. భారత దేశ సినిమా ఖ్యాతిని నలుదిశలకు ప్రసరింప చేస్తూ బలంగా నిలబడింది ఈ పరిశ్రమ. అంతేకాకుండా యువతరానికి నేనున్నాను అన్న భరోసాను కలిగిస్తుంది ఈ పరిశ్రమ. ఎంతో మంది యువ నటీనటులకు,నిర్మాతలకు,దర్శకులకు అవకాశం కల్పిస్తోంది ఈ సినీ పరిశ్రమ. అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తూ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించేలా చేస్తుంది ఈ పరిశ్రమ. ఎంతోమంది పేద కార్మికులకు అన్నం పెడుతుంది ఈ పరిశ్రమ. దాన వీర సూర కర్ణ,అల్లూరి సీతారామరాజు,మేజర్ చంద్రకాంత్,శివ,సమర సింహ రెడ్డి,ఠాగూర్,పోకిరి,గబ్బర్ సింగ్ మరియు ఈగ,బాహుబలి,బహుబలి 2 లాంటి చిత్రాలతో చరిత్ర సృష్టించిన పరిశ్రమ. 2013 లో భారతదేశానికి సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 17 శాతం వాటాను కలిగి ఉన్న పరిశ్రమ. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు ధీటుగా నిలుస్తూ విజయవంతంగా ముందుకు నడుస్తున్న మనందరి పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ తెలుగు చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అని పిలుస్తారు. 


తెలుగు సినిమాలకు పితృ సమానుడిగా రఘపతి వెంకయ్య నాయుడు గారిని కొలుస్తారు. ఈయన 20వ శతాబ్దం మొదట్లో సొంతంగా సినిమాలను తీస్తూ తెలుగు సినిమాలను గురించి తెలియ చేయడానికి ప్రపంచమంతా పర్యటించేవారు. అయితే మొదట్లో అన్ని మూగ సినిమాలు తీసేవారు. హెచ్.ఎమ్.రెడ్డి అనే వ్యక్తి మొదటి తెలుగు-తమిళ్ మోషన్ పిక్చర్ అయిన కాళిదాస్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన తెలుగులో మంచి విజయం సాధించిన భక్త ప్రహళ్లాద సినిమాకు దర్శకుడు. సి.ఎన్.ఎన్ ఛానల్ ప్రకటించిన 100 భారతదేశ అద్భుత చిత్రాలలో పాతాళ భైరవి,మల్లీశ్వరి,దేవదాసు,మాయాబజార్,నర్తనశాల మరియు మరోచరిత్ర,మా భూమి,సాగర సంగమం,శంకరాభరణం,శివ సినిమాలు నిలిచాయి. 2017 లో విడుదలైన బాహుబలి2 సినిమా భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. 2018-2019 సంవత్సరాలలో భారతదేశంలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన పరిశ్రమలలో బాలీవుడ్ తర్వాతి స్థానంలో టాలీవుడ్ నిలిచింది. 

20వ శతాబ్దంలో నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు,ఘట్టమనేని కృష్ణ,శోభన్ బాబు,కృష్ణంరాజు,మురళీ మోహన్ లాంటి హీరోల చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించేవి.  

మొదట్లో బ్లాక్ అండ్ వైట్ 35mm సినిమాలు సినిమా థియేటర్లలో విడుదల చేసేవారు. మొదటి తెలుగు సినిమా స్కోప్ చిత్రాన్ని హీరో  కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రంతో మన ముందుకు తీసుకొచ్చారు. అంతే కాకుండా మొదటి 75 mm చిత్రాన్ని సింహాసనం చిత్రం ద్వారా హీరో కృష్ణ మన ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాకుండా మొదటి డి.టి.ఎస్ చిత్రాన్ని తెలుగు వీర లేవరా సినిమా ద్వారా హీరో కృష్ణ మనకు పరిచయం చేసారు. 

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్,గీత ఆర్ట్స్,వైజయంతి మూవీస్,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,ఆర్కా మీడియా,మైత్రి మూవీస్,యూవీ క్రియేషన్స్,14 రీల్స్ లాంటి సంస్థలు పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నాయి. 

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లాంటి హీరోల చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తున్నాయి. 

అనుష్క శెట్టి,కాజల్ అగర్వాల్,సమంత,తమన్నా,నయనతార,రష్మిక మందాన,నభా నటాషా,కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అగ్రతారలుగా వెలుగొందుతున్నారు.  
 

28, అక్టోబర్ 2020, బుధవారం

తన అందంతో ,ఆకృతితో కోట్ల మంది వీక్షకులను కట్టిపడేసిన కట్టడం ఈఫిల్ టవర్.

ఈఫిల్ టవర్


ప్రపంచంలోని అతి పెద్ద కట్టడాలలో ఒకటైన కట్టడం, కోట్ల మందిని తన అందంతో కట్టిపడేసిన కట్టడం, కట్టి ఎన్నో సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా బలంగా నిలబడిన కట్టడం, చరిత్రలో తన కంటూ ఒక ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న కట్టడం, జీవితంలో ఒకసారైనా చూడాల్సిన కట్టడం ప్యారిస్ లో నిర్మించబడిన ఈఫిల్ టవర్ కట్టడం.


ఈఫిల్ టవర్ చరిత్ర :


ఈ ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ దేశం, ప్యారిస్ నగరంలోని చాంప్ డే మార్స్ లో ఉంది. ఈ ఈఫిల్ టవర్ ని చేత ఇనుప జాలకం తో నిర్మించారు. ఈ ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే 2వ అతి పెద్ద టవర్ గా కీర్తిని గడించింది. 

మారిస్ కొచ్లిన్ మరియు ఎమిలే నౌగియర్ అనే ఇద్దరు డిజైనర్స్  సొసైటీ డి ఎక్స్ప్లోయిటేషన్ డి లా టూర్ ఈఫిల్ అనే కంపెనీలో పని చేసేవారు. ఈ కంపెనీకి బాస్ గుస్తావే ఈఫిల్. వీళ్ళిద్దరూ ఈఫిల్ టవర్ యొక్క డిజైనును రూపొందించారు. డిజైన్ పూర్తయిన వెంటనే ఆ ఇద్దరు డిజైనర్స్ ఆ డిజైన్ ను తమ బాస్ అయిన ఈఫిల్ కి చూపిస్తారు, ఆ డిజైన్ చూసిన ఈఫిల్ కొన్ని మార్పులను చేయమంటాడు. అప్పుడు డిజైనర్స్ ఇద్దరు స్టీఫెన్ సౌవేస్టర్ తో కలిసి బేస్ డిజైన్, డెకరేషన్స్ చేసి పూర్తి డిజైన్ ని ఈఫిల్ కి చూపించి ఆమోదాన్ని పొందుతారు. అసలు ఈ టవర్ కట్టడానికి ప్రధాన కారకుడు ఈఫిల్. ఈఫిల్ న్యూ యార్క్ లో ఉన్నలాటింగ్ అబ్జర్వేటరీ కట్టడాన్ని ప్రేరణగా తీసుకుని దీన్ని నిర్మించాలని అనుకున్నాడు.

ఈఫిల్ ఆమోదాన్ని పొందిన ఈ టవర్ యొక్క ఎత్తు 300 మీటర్లుగా నిర్దారిస్తారు. అయితే మొదట్లో 300 మీటర్ల ఎత్తు గల భవనం యొక్క నిర్మాణం సాధ్యం కాదని అందరూ అనేవారు, కొంతమంది నేరుగానే టవర్ ని నిర్మించాలనుకున్న ఈఫిల్ ని విమర్శించేవారు. కాని ఈఫిల్ వాటిని లెక్క చేయలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద టవర్ ని నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా ప్రణాళికలను రూపొందించి పనులను చకచకా ముందుకు నడిపించాడు. అయితే ఈ టవర్ యొక్క డిజైన్ నాలుగు వేరువేరు లాటిస్ గిర్డర్ స్థంబాలపై నిలబడి చివర్లో కలిసినట్టుగా ఉండేలా రూపొందించారు.

ఈఫిల్ ఈ డిజైన్ కి ఆమోదాన్ని పొందడమే కాకుండా దీన్ని ఆర్ట్స్ డిజైన్ ఎక్సిబిషన్ లో ప్రదర్శిస్తాడు. అలా మార్చి 30, 1885 న, ఈఫిల్ తన ప్రణాళికలను సొసైటీ డెస్ ఇంజినియర్స్ సివిల్స్‌కు సమర్పిస్తాడు. సాంకేతిక సమస్యలను చర్చించిన తరువాత మరియు టవర్ యొక్క ఆచరణాత్మక ఉపయోగాలను నొక్కిచెప్పిన తరువాత, టవర్ ప్రతీకను గురించి చెప్పి తన ప్రసంగాన్ని ముగిస్తాడు. అలా ఎన్నో ఆమోదాలు పొందిన తర్వాత 28 జనవరి 1887లో ఈ ఈఫిల్ టవర్ కట్టడాన్ని నిర్మించడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల పాటు అలుపెరగని నిర్మాణాన్ని జరిపి చివరకు 15 మార్చి 1889లో టవర్ యొక్క నిర్మాణం పూర్తి చేస్తారు. 31 మార్చి 1889లో ఈ ఈఫిల్ టవర్ ని ప్రారంభించారు. ఈఫిల్ టవర్ పై ఏర్పరచిన టిప్ తో కలిసి ఈ టవర్ యొక్క మొత్తం పొడవు 324 మీటర్లుగా నిర్దారించారు.

ఈ టవర్ సందర్శకుల సౌకర్యార్ధం కోసం మూడు స్థాయిలుగా విభజించబడింది. మొదటి స్థాయికి రెండవ స్థాయికి వెళ్ళడానికి మెట్ల సౌకర్యం ఉంది. మొదటి రెండు స్థాయిలలో రెస్టారెంట్స్ ఉంటాయి. మూడవ స్థాయికి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి కాని ఎక్కువ దూరం కావడం వల్ల సందర్శకులు లిఫ్ట్ లోనే వెళ్తారు. భూమి నుండి మూడవ స్థాయికి ఈ టవర్ ఎత్తు 276 మీటర్లుగా ఉంది.

2015వ సంవత్సరంలో డబ్బులు కట్టి సందర్శించే కట్టడాల్లో 69 లక్షల మంది సందర్శించిన 
అద్భుత కట్టడంగా చరిత్రలో నిలిచింది.

13, అక్టోబర్ 2020, మంగళవారం

వూహన్ ప్రభుత్వ ప్రయోగ శాలలో నోవల్ కరోనా వైరస్ అభివృద్ధి చెందిందని చైనా వైరాలజిస్ట్ అంటున్నారు.

చైనాలో పుట్టిన నోవల్ కరోనా వైరస్


ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసేసింది, ఎంతోమంది ఆకలి చావులకు కారణమయ్యింది, ఎన్నో దేశాల ఆర్ధిక వ్యవస్థలకు తీరని నష్టాలను కలిగించింది, మరెంతో మందిని ప్రాణాలు కోల్పోయేలా చేసింది, అతి తక్కువ రోజులలో ఇదంతా చేసింది, ఇలా ఇదంతా చేసింది, ఈనాటీ  పరిస్థితులకు కారణం అయ్యింది ఒకే ఒక్క వైరస్, ప్రపంచమంతటా వ్యాపించి ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్. 

విషయానికి వస్తే ఈ కరోనా వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్ నుండి పుట్టిందని అక్కడి నుండి చైనాకు మరియు ఇతర దేశాలకు వ్యాపించిందని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మొదటి నుండి చెప్పుకొస్తోంది. అయితే ఈ కరోనా వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్లో పుట్టలేదని వూహన్ వైరాలజీ ల్యాబ్ లో పుట్టిందని చైనా వైరాలజిస్ట్ చెబుతున్నారు. 



డాక్టర్, వైరాలజిస్ట్ అయిన  లీ మాంగ్ యాన్ అనే మహిళ కరోనా వైరస్ చైనాలో పుట్టిందని మీడియాకు వివరించింది. అయితే ఈమె హాంగ్ కాంగ్ స్కూల్ అఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రమాద వ్యాధుల నిపుణురాలిగా పని చేసేవారు. అక్కడినుండి చైనాలోని వూహన్ లో కొత్తగా వచ్చిన  లుకేమియా వ్యాధి పై రహస్య పరిశోధనలు చేయడానికి వెళ్లిన వాళ్లలో ఈమె ఒకరు. ఈమె డిసెంబర్, 2019 మరియు జనవరి, 2020 లో చేసిన పరిశోధనల ఫలితాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ సూపర్ వైజర్ కి వెల్లడిస్తుంది. అయితే అతను పట్టించుకోడు, మరియు ఆమెకు ఈ వైరస్ గురించి పట్టించుకోవద్దని ఒక వేళ దీని గురించి ఎవరితోనైనా చెబితే నువ్వు బ్రతికి ఉండవు అని ఆమెకు చెబుతాడు. అయితే ఈ రోగం ముందు ముందు రోజుల్లో ప్రమాదకారిగా మారొచ్చని దీని గురించి ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో చైనాలోని లూథర్ అనే వ్యక్తిని కలుస్తుంది. ఆయనతో తన పరిశోధనల ద్వారా కనిపెట్టిన 5 ఫలితాలను అతనికి తెలియజేస్తుంది.

1) కోవిడ్ -19 వైరస్ ని చైనా ప్రభుత్వం కనిపెట్టింది. 
2) ఇది ఒక మనిషి నుండి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధి. 
3) ఇది ముందు ముందు రోజుల్లో అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. 
4) ఈ వైరస్ చైనా లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్ నుండి రావడం నిజం కాదు. 
5) ఇది ప్రకృతి నుండి వచ్చిన వైరస్ కాదు చైనాలోని వుహాన్ ల్యాబ్ లో సి.సి.45,జె.ఎక్స్.ఈ.21 అనే చెడ్డ కరోనా కణాలతో తయారు చేయబడిన వైరస్, ఈ వైరస్ లో చిన్న చిన్న మార్పులు చేసి చివరకు నోవల్ కరోనా వైరస్ గా రూపుదిద్దారు. 

అయితే ఈ వైరస్ చైనాలోని ల్యాబ్ లో పుట్టిందనడానికి చైనా శాస్త్రవేత్తల అధ్యయనం, హంగ్ కాంగ్ నిపుణుల అధ్యయనం మనకు ఆధారాలుగా నిలుస్తాయి అని ఆమె చెబుతుంది. అయితే ఈ వైరస్ చైనాలోని లైవ్ సీ ఫుడ్స్ మార్కెట్లోని సీ ఫుడ్స్ కణాల నుండి రాలేదని ఈ వైరస్ మనిషి యొక్క కణాల నుండి పుట్టిందని, యూ.ఎస్ లోని శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేస్తున్నారని మరికొన్ని రోజుల్లో తమ పరిశోధనల ఫలితాలను ఒక బుక్ లో ప్రచురించి ప్రపంచానికి కరోనా వైరస్ యొక్క నిజాన్ని  తెలిసేలా చేస్తామని ఆమె తెలియచేసారు. అంతే కాకుండా ఈ బుక్ ను చూస్తే ఎటువంటి బయాలజీ నాలెడ్జి లేకపోయినా సరే ఈ వైరస్ మనిషి కణాలతో తయారుచేశారని సులువుగా తెలుస్తుందని ఆమె తెలియ చేసారు. 

7, అక్టోబర్ 2020, బుధవారం

ఆపిల్ సంస్థ తమ మొట్టమొదటి ఆన్ లైన్ ఈ కామర్స్ స్టోర్ ని ఇండియాలో ప్రారంభిస్తోంది.

ఆపిల్ ఇండియన్ ఆన్ లైన్ స్టోర్


ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఎన్నో దేశాలలో తమ వస్తువులను అమ్ముతూ తమ సంస్థకు ఒక ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్న కంపెనీ ఆపిల్. అమెరికాలో మొదలైన చిన్న కంపెనీ ఈ రోజు ప్రపంచం మెచ్చుకోదగ్గ టెక్ కంపెనీ లలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పటి వరకు ఆపిల్ తమ వస్తువులను ఇండియా లోని రిటైల్ స్టోర్స్ లోను,అమెజాన్,ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో మాత్రమే విక్రయించేది. అయితే ఇప్పుడు ఆపిల్ భారతదేశంలో తమ వస్తువులను నేరుగా తమ వెబ్ సైట్స్ లో అమ్మడానికి సిద్ధమైంది. అందుకోసం ఆపిల్ తన ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్ ని భారతదేశంలో ప్రారంభించింది. ఇలా ఆన్ లైన్ లో తమ వస్తువులను అమ్మడం ద్వారా  మరింత డిమాండ్ ను మరియు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆపిల్ ప్రయత్నిస్తోంది. 


ఈ ఆపిల్ ఆన్ లైన్ స్టోర్స్ లో అన్ని రకాలైన ఆపిల్ ఉత్పత్తులు ఐఫోన్,మ్యాక్,ఐపోడ్ టచ్,ఐపాడ్,వాచ్,టీవీ,ఎయిర్ పోడ్స్,మ్యూజిక్,హోమ్ పోడ్,యాక్సెసరీస్ అమ్ముతున్నారు. అంతే కాకుండా ఆపిల్ సర్వీసెస్ అయిన ఆపిల్ మ్యూజిక్,ఆపిల్ టీవీ ప్లస్,ఆపిల్ ఆర్కేడ్,ఐ క్లౌడ్,ఆపిల్ వన్,ఆపిల్ బుక్స్ ను అందుబాటులోకి తెచ్చారు.అంతే కాకుండా మనకు నచ్చిన ఐఫోన్ యొక్క కాన్ఫిగరేషన్,స్టోరేజ్ కెపాసిటీ,ర్యామ్ వంటి విషయాలను పూర్తిగా చుసిన తర్వాత మనం ఐఫోన్ ను ఆర్డర్ చేయవచ్చు.  

ఈ ఆన్ లైన్ స్టోర్ 23,సెప్టెంబర్,2020 నుండి భారతదేశంలో అందుబాటులోకి వస్తుంది. 

ఆపిల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ :


ఈ ఆపిల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ద్వారా మన పాత ఆపిల్ మొబైల్ ఫోన్ ని ఇవ్వడం ద్వారా కొత్త ఆపిల్ మొబైల్ ఫోన్ ని తీసుకునే సదుపాయాన్ని ఆపిల్ సంస్థ మనకు కల్పిస్తుంది. ఇందుకోసం మనం ఆపిల్ ఆన్ స్టోర్ లో మన పాత ఐఫోన్ యొక్క సమాచారాన్ని తెలియచేయవలసి ఉంటుంది. అలా ఆపిల్ అడిగిన పూర్తి ప్రశ్నలకు సమాధానాలు తెలిపిన తర్వాత మనం ఆర్డర్ చేసే కొత్త మొబైల్ ఫోన్ ప్రైస్ మనకు తెలుస్తుంది.క్రెడిట్ కార్డ్స్ పై నెలవారీ డబ్బు చెల్లింపుల సదుపాయం కూడా ఆపిల్ మనకు కల్పిస్తుంది. 

ఆపిల్ కేర్ ప్లస్ (+):


మీరు ఆపిల్ ఐఫోన్లను కొనుక్కుంటే మీకు కంపెనీ ద్వారా వారెంటీ అనేది వస్తుంది. అయితే ఈ కంపెనీ వారెంటీ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. అయితే  ఆపిల్ మన ముందుకు తీసుకు వచ్చిన ఆపిల్ కేర్ ప్లస్ ద్వారా మన మొబైల్ తో పాటు వచ్చిన 1 సంవత్సరం వారెంటీతో పాటు మరో రెండు సంవత్సరాలు వారెంటీ మనకు లభిస్తుంది. అయితే ఈ వారెంటీలో కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

మొదటగా ఈ ఆపిల్ కేర్ ప్లస్ సదుపాయాన్ని పొందాలంటే మీరు ఆపిల్ ప్రోడక్ట్  కొని 60 రోజులు మించకూడదు. ఆపిల్ ప్రోడక్ట్ కొన్న 60 రోజులలోపు మాత్రమే మీరు ఈ సదుపాయాన్ని  పొందగలరు. ఇంకా ఈ సదుపాయాన్ని పొందడానికి మీరు మీ కొత్త ఆపిల్ మొబైల్ ఫోన్ నుండే రిజిస్టర్ అవ్వొచ్చు. లేదంటే 0008001009009 కు డయల్ చేయడం ద్వారా కూడా మీరు ఈ సదుపాయాన్ని పొందగలరు. అయితే నెంబర్ డయల్ చేయడం ద్వారా ఈ  సదుపాయాన్ని పొందడం కోసం మీరు మొబైల్ కొన్న పేమెంట్ స్లిప్ ను సమర్పించవలసి ఉంటుంది. 

ఈ ఆపిల్ కేర్ ప్లస్ సదుపాయాన్ని ఆక్టివేట్ చేసుకోవడం ద్వారా సాఫ్ట్ వేర్ సమస్యలైనా ఐఫోన్,ఐ.ఓ.ఎస్,ఆపిల్ బ్రాండెడ్ యాప్స్ లో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆపిల్ ప్రతినిధులు ఇచ్చే సలహాలు సూచనలతో మన ఆపిల్ డివైస్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
  
అంతేకాకుండా మన ఆపిల్ డివైస్ లో ఏమైనా హార్డ్ వేర్ సమస్యలు తలెత్తితే రిపేర్ మరియు ప్రోడక్ట్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే స్క్రీన్ డామేజ్ గాని మరేయితర డామేజ్ అయినా సంవత్సరంలో 2 సార్లు మాత్రమే చూస్తారు. అంటే మొత్తం రెండు సంవత్సరాల వారెంటీ లో 4 సార్లు డామేజ్ ప్రొటెక్షన్ కవర్ మనకు లభిస్తుంది. అయితే స్క్రీన్ డామేజ్ కి  సర్వీస్ ఛార్జ్ 2500 రూపాయలు తీసుకుంటారు. మరేయితర డామేజ్ అయిన గాని 8900 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు.  

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...